తమిళనాడు, బంగాల్లో NDA విజయం ఖాయం : అమిత్ షా
త్వరలో తమిళనాడు, బంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని పుదుక్కోట్టైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. 2024 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సాధించిన విజయాలను ప్రస్తావించారు. హరియాణాలో వరుసుగా మూడో విజయం, దిల్లీ, బిహార్లలో సాధించిన విజయాల గురించి చెప్పారు. ఇక తమిళనాడు, బంగాల్ కూడా బీజేపీ విజయాల జాబితాలో చేరే సమయం వచ్చిందని అన్నారు.


Pratiroju 




