దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేశ్ - ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు
దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు జ్యూరిక్ చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో వారికి పలువురు ప్రముఖులు, తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూరప్లోని 20కి పైగా దేశాల నుంచి తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు.


Pratiroju 




