మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్..!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీ షైన్ను త్వరలో వివాహమాడనున్నాడు. ఫిబ్రవరి మూడో వారంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. దిల్లీలో వివాహ వేడుకలు జరుగుతాయని తెలుస్తోంది. ధావన్ పెళ్లికి క్రికెటర్లు, బాలీవుడ్ నటులు హాజరవుతారని సమాచారం. ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్ (Sophie Shine)తో ధావన్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ‘గబ్బర్’ ఈమెతో కలిసి వీక్షించాడు. దీంతో సోఫీ పేరు వెలుగులోకి వచ్చింది.
ఆ మధ్య ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. తన గర్ల్ఫ్రెండ్ గురించి అడిగారు. దానికి శిఖర్ స్పందిస్తూ ‘నేను పేరు చెప్పను. కానీ, నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి మాత్రం ఆమే’ అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. 2014లో వీరికి ఒక బాబు పుట్టాడు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉన్నారు. 2023లో దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.


Pratiroju 




