సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
Sankranti Special Trains | హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో 11 ట్రైన్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 7 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఆయా రైళ్లలో 1ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ కోచ్లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్లకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది. రైళ్ల వివరాలు ఇవీ..


Pratiroju





