శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఖతార్ నుంచి వచ్చిన విమానంలో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.14కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు.