శిర్డీ సాయినాథుడ్ని దర్శించుకున్న మంత్రి లోకేశ్ దంపతులు
శిర్డీలోని సాయినాథుడ్ని ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి దర్శించుకున్నారు. సాయిబాబాకు నిర్వహించే కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. హారతి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు.


Pratiroju 




