లోక్‌భవన్‌లో న్యూఇయర్‌ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

లోక్‌భవన్‌లో న్యూఇయర్‌ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

విజయవాడ: లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.  దర్బార్‌ హాల్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌, సమీరా నజీర్‌ దంపతులు కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌ దంపతులు.. గవర్నర్‌ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.