'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ వచ్చేసింది- వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్!

'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ వచ్చేసింది- వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్!

 మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా రూపొందిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీమేకర్స్ ఆదివారం తిరుపతిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్​లోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పూర్తిగా కామెడీనే కాకుండా చిరు స్టైల్​కు తగ్గట్లుగా మాస్ ఎలిమెంట్స్​ను కూడా అనిల్ జోడించారు.

ట్రైలర్​లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కనిపించింది. 'ఇంటలిజెన్స్ బ్యూరో, రా ఏంజెట్, ఎలాంటి క్రిమినల్​ను అయినా ఉతికారేస్తారు' అంటూ ఎలివేషన్ ఇస్తూనే చిరును ఫ్యామిలీ మ్యాన్​లా చూపించారు. కామెడీ సీన్స్​లో వింటేజ్ చిరును గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. పైకీ గంభీరంగా ఉంటూన్నా భార్యకు మాత్రం కాస్త భయపడే భర్తలా క్యారెక్టర్​ను చూపించారు. చిరు- నయనతార మధ్య సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. ఈ సీన్స్​ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

'మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరపు బంధువుల్ని ఆడుకుంటే మజాగా ఉంటుంది' అని చిరు డైలాగ్ చెప్పడం చూస్తుంటే ఈ సినిమాలో చిరును నయన్ టార్చర్ పెట్టారేమో అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్​లాగానే కాకుండా ఫ్యాన్స్​ కోసం ఆయనలోని మాస్ ఎలిమెంట్స్ కూడా టచ్ చేశారు. గోల్ఫ్ కోర్ట్​లో ఫైట్, యాక్షన్ సీక్వెన్స్​స్ కూడా జోడించారు. దీంతో ఇది మెగా ఫ్యాన్స్​కు ఫుల్ మీల్స్ సినిమాలాగా అనిపిస్తుంది.

ఇక ట్రైలర్ ఆఖర్లో వెంకటేశ్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ అదిరిపోయింది. 'ఫ్యామిలీ మ్యాన్​లా ఉన్నావ్, మాస్ ఎంట్రీ ఇచ్చావేంటీ?' అని వెంకీతో చిరుతో అనగా, 'మాస్​కే బాస్​లా ఉన్నావ్, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి?' అని వెంకీ రిప్లై ఇస్తారు. ఇలా ఓవరాల్​గా 2.40 నిమిషాల ట్రైలర్ ఆధ్యంంతం ఆకట్టుకుంటుంది.

మెగా వైబ్స్ పక్కా: అనిల్ రావిపూడి

తిరుపతిలో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో డైరెక్టర్ అనిల్ మాట్లాడారు. పూర్తిగా చిరంజీవి మాస్ అండ్ కామెడీ ఇమేజ్​లో వచ్చిన లీడర్ రాజు (ఘరానా మొగుడు), ఆటో జానీ (రౌడీ అల్లుడు) పాత్రలను దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాసినట్లుగా చెప్పారు. అలా రాసుకున్న ఈ స్టోరీని చిరంజీవి తన అనుభవంతో పీక్స్​లోకి తీసుకెళ్లారని అన్నారు. జనవరి 12న ఫ్యాన్స్ అందరూ 'మెగా' వైబ్స్ ఎంజాయ్ చేస్తారని అనిల్ జోష్ నింపారు. అలాగే హీరోయిన్ నయనతారకు, మెగాఫ్యాన్స్ అందరికీ అనిల్ థాంక్స్ చెప్పారు.

కాగా, ఇందులో నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారు. విక్టరీ వెంకేటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, సాంగ్స్​ సినిమాపై ఆసక్తిని పెంచాయి. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ బ్యానర్​పై సాహు గారపాటి, కొనిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ రీసెంట్​గానే పూర్తి అయ్యింది. ఇది 2 గంటల 35 నిమిషాల రన్​టైమ్​తో సంక్రాతి కానుకగా జనవరి 12న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.